వరిలో విత్తన శుద్ది by RFIS-ADVISORIES published on 2023-03-01T14:27:29Z రబీలో వరి సాగు చేసే రైతులు నారుమడి పోసుకునే ముందు విత్తన శుద్ది చేసుకోవాలి. మెట్ట నారుమళ్ళకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ ను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమళ్ళైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ ను ద్రావణంలో కలిపి 24 గంటలు నానబెట్టి తరువాత మండెకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి.